ముఖేష్ అంబానీ కీలక ప్రకటన.. వినాయక చవితి నుంచి ప్రారంభం

by Disha Web Desk 2 |
ముఖేష్ అంబానీ కీలక ప్రకటన.. వినాయక చవితి నుంచి ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వినాయక చవితి(సెప్టెంబర్ 19) నుంచి జియో ఎయిర్ ఫైబర్ లాంచ్ చేస్తున్నామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. దేశంలో అందరికీ 5జీ నెట్ వర్క్ అందిండమే లక్ష్యమని చెప్పారు. ఇవాళ రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందరికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సేవలు అందిస్తామని చెప్పారు. కొన్నేళ్ల కిందట అందరికీ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తామని చెప్పాం.. ఆ మాట నిలబెట్టుకున్నామన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో పురోగతిని గుర్తించేందుకు టాలెంట్ పూల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. తాము ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.



Next Story

Most Viewed