రూ. 2,847 కోట్ల విలువైన నిధులు సేకరించిన PhonePe!

by Disha Web Desk 10 |
రూ. 2,847 కోట్ల విలువైన నిధులు సేకరించిన PhonePe!
X

ముంబై: ఇటీవల వాల్‌మార్ట్ నుంచి పూర్తిగా వేరైన ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే కొత్తగా రూ. 2,847 కోట్ల(350 మిలియన్ డాలర్ల) విలువైన నిధులను సేకరించింది. ఈ నెలలో కంపెనీ మొత్తం 1 బిలియన్ డాలర్ల నిధులు సేకరించాలనే లక్ష్యంతో ఉంది. 12 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ విలువ వద్ద జనరల్ అట్లాంటిక్ సంస్థ నిధులు సమకూర్చింది. ఈ నిధుల సమీకరణతో ఫోన్‌పే కంపెనీ 2020లో 5.5 బిలియన్ డార్ల విలువైన కంపెనీ నుంచి దాదాపు రెట్టింపు విలువను దక్కించుకుంది. వాల్‌మార్ట్ నుంచి విడిపోయిన అనంతరం ఫోన్‌పే తన ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చింది. దీంతో ప్రస్తుతం పూర్తిస్థాయి భారతీయ సంస్థగా మారింది. ఈ నేపథ్యంలో నిధుల సేకరణ ద్వారా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు డేటా సెంటర్లు, ఆర్థిక సేవల విస్తరణ, బీమా, రుణాలు, నిర్వహణ వంటి అవసరాలకు నిధులను వినియోగించనున్నట్టు తెలుస్తోంది. డిజిటల్ చెల్లింపులు పెరిగేందుకు చర్యలు చేపట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, 2015 డిసెంబర్‌లో ప్రారంభమైన ఫోన్‌పే ఇప్పటివరకు 40 కోట్ల యూజర్లను కలిగి ఉంది.


Next Story

Most Viewed