- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈ-కామర్స్ కంపెనీల తో లక్షన్నర చిన్న దుకాణాలు మూతబడ్డాయి: సీఏఐటీ!
న్యూఢిల్లీ: బడా సంస్థల వ్యాపార విధానం, వాటి వ్యాపార పనితీరుపై సమర్థవంతమైన తనిఖీ లేకపోవడం కారణంగా భారత్లో ఇప్పటివరకు 1.5 లక్షాల చిన్న దుకాణాలు మూసివేయబడ్డాయని వ్యాపారుల సమాఖ్య ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని 8 కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్య వహిస్తున్న ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ), చిన్న వ్యాపారులను కాపాడేందుకు రిటైల్ రంగంలో సమగ్రమైన విధానం, వాణిజ్య కార్యకలాపాలను పర్యవేక్షించే నియంత్రణ అత్యవసరమని పేర్కొంది. దేశంలోని ఈ-కామర్స్ కంపెనీలు అందించే డిస్కౌంట్లు, ఇతర ధరల విధానాల వల్ల చిన్న వ్యాపారులు ఎక్కువ ప్రభావితమవుతున్నారు.
ఈ కంపెనీలు చట్టవిరుద్ధమైన వస్తువుల కొనుగోళ్లు, నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించడం ద్వారా జీఎస్టీ, ఆదాయపు పన్నులను పెద్ద ఎత్తున ఎగవేశాయి. కానీ వాటిపై ఎలాంటి చర్యలు ఇంకా తీసుకోలేదు. ఈ పరిణామాల వల్ల దేశీయ రిటైల్ వ్యాపారాలు దెబ్బతిన్నాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఇదే సమయంలో దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ-కామర్స్ పాలసీ ఇంకా అమలు చేయబడలేదని వ్యాపారుల సమాఖ్య అభిప్రాయపడింది.