పెళ్లి వేడుకల్లో ఆకట్టుకున్న నీతా అంబానీ నృత్య ప్రదర్శన

by Dishanational1 |
పెళ్లి వేడుకల్లో ఆకట్టుకున్న నీతా అంబానీ నృత్య ప్రదర్శన
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ 'విశ్వంభరి స్తుతి' పేరున చేసిన నృత్య ప్రదర్శన అతిథులను ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను నీతా అంబానీ సోమవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న జంటకు అమ్మవారి ఆశీస్సులను కోరుతూ నీతా అంబానీ నాట్యం చేశారు. ఈ ప్రదర్శనను అంబానీ మనవరాళ్లు ఆదియా శక్తి, వేదకు అంకితం చేశారు. సంగీత దర్శకులు అజయ్-అతుల్, గాయని శ్రేయా ఘోషల్ నేతృత్వంలో ప్రదర్శన జరగ్గా, వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ చేశారు. నీతా అంబానీ దుస్తులను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఆదివారం 'హస్తాక్షర్' తో ముగిసిన ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో దేశీ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు పాల్గొన్నారు. బార్బేడియన్ గాయని రిహానా వంటి గ్లోబల్ స్టార్లు ప్రదర్శనలు చేశారు.


Next Story

Most Viewed