జియో యూజర్లకు న్యూ ఇయర్ ధమాకా.. ఏడాది ప్లాన్‌తో రూ. 35,100 విలువైన సబ్ స్క్రిప్షన్ ఉచితం

by Malleboina Mahesh |   (  Updated:2025-12-15 08:29:44  IST  )

న్యూ ఇయర్ సందర్భంగా రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

జియో యూజర్లకు న్యూ ఇయర్ ధమాకా.. ఏడాది ప్లాన్‌తో రూ. 35,100 విలువైన సబ్ స్క్రిప్షన్ ఉచితం
X

దిశ, వెబ్ డెస్క్: న్యూ ఇయర్ సందర్భంగా రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో ప్రకటించిన ఈ కొత్త ఆఫర్లలో రూ. 3,599 ప్లాన్ అత్యంత ముఖ్యమైనది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ఏడాది పాటు (365 రోజులు) రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. దీనితో పాటు, ఈ ప్లాన్‌లో వినియోగదారులకు రూ. 35,100 విలువైన Google Gemini Pro ప్లాన్ను 18 నెలల పాటు ఉచితంగా అందించడం ఈ ఆఫర్లలో హైలైట్‌గా నిలిచింది.

అలాగే జియో ఇతర ఆకర్షణీయమైన ప్లాన్‌లను కూడా ప్రకటించింది. వినియోగదారులు ₹500తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలతో పాటు, వివిధ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. అత్యవసర డేటా అవసరాల కోసం, ₹103తో 28 రోజుల కాలపరిమితితో 5GB డేటాను అందించే డేటా ప్యాక్‌ను కూడా జియో అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్‌లు, ఉచిత ఏఐ సేవలతో (Google Gemini Pro), జియో ఈ న్యూ ఇయర్‌ను టెక్నాలజీ, కనెక్టివిటీకి మిళితం చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Next Story