- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LIC: విద్యార్థుల కోసం 'గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ పథకం' ప్రారంభించిన ఎల్ఐసీ
ఆదివారం నుంచి ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందని ఎల్ఐసీ ఎక్స్లో ట్వీట్ చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కొత్త స్కాలర్షిప్ స్కీమ్ను ప్రారంభించింది. 'గోల్డెన్జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్-2024' పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ప్రతిభ ఉన్న విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించనున్నట్టు ఎల్ఐసీ అధికారిక ప్రకటనలో పేర్కోంది. ఆదివారం నుంచి ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందని ఎల్ఐసీ ఎక్స్లో ట్వీట్ చేసింది. ఈ స్కాలర్షిప్ పథకం కోసం 2021-22, 2022-23, 2023 -24 అకడమిక్ సంవత్సరాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమో లేదా తత్సమాన విద్యను పూర్తి చేసుకున్నవారు అర్హులు. కనీసం 60 శాతం మార్కులు లేదా సమానమైన సీజీపీఏ గ్రేడ్ కలిగి ఉండాలి. 2024-25లో ఉన్నత విద్య చదవాలని భావించే విద్యార్థులకు జనరల్ స్కాలర్షిప్లు లభిస్తాయి. మెడిసిన్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఏదైనా విభాగంలో డిప్లొమో, గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో వొకేషన్ కోర్సులులతో పాటు ఐటీఐ చదవాలనే వారికి స్కాలర్షిప్ భరోసా ఇవ్వనుంది.






