ప్రభుత్వానికి రూ.2,441 కోట్ల డివిడెండ్ చెల్లించిన ఎల్ఐసీ

by Dishanational1 |
ప్రభుత్వానికి రూ.2,441 కోట్ల డివిడెండ్ చెల్లించిన ఎల్ఐసీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ).. కేంద్ర ప్రభుత్వానికి రూ.2,441.44 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసీ చైర్మన్‌ సిద్ధార్థ మొహంతి డివిడెండ్‌ను చెక్‌ను అందజేశారు. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. డివిడెండ్ చెక్కును ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి, ఇతర అధికారుల సమక్షంలో ఆర్థిక మంత్రికి అందజేశారు. శుక్రవారం ట్రేడింగ్‌లో ఎల్ఐసీ సంస్థ షేర్ ధర 0.69 శాతం పెరిగి రూ. 1,029.90 వద్ద ముగిసింది.



Next Story