- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IndGo: రెండు రోజుల్లో 300 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసిన ఇండిగో
ముంబై విమానాశ్రయంలో బుధవారం ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కనీసం 33 విమానాలు రద్దు చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పైలట్ల కొరత కారణంగా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేస్తోంది. కొత్త విమాన డ్యూటీ టైమ్ లిమిటేషన్(ఎఫ్డీటీఎల్) నిబంధనలు అమలు చేసిన తర్వాత పైలట్ల కొరత పెరగడం వల్ల రెండు రోజుల వ్యవధిలో 300కి పైగా విమానాలను రద్దు చేసింది. వందలాది విమానాలను ఆలస్యంగా నడుపుతున్నట్టు విమానయాన పరిశ్రమ వర్గాలు బుధవారం వెల్లడించాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం, ఇండిగో ఆన్-టైమ్ పనితీరు (ఓటీపీ) 35 శాతానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలోనే దేశీయ, అంతర్జాతీయంగా కనీసం 38 ఇండిగో విమానాలు బుధవారం ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రద్దు చేసినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముంబై విమానాశ్రయంలో బుధవారం ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కనీసం 33 విమానాలు రద్దు చేసింది. మొత్తంగా గత రెండు రోజుల్లో (మంగళవారం,బుధవారం) ఇండిగో దేశవ్యాప్తంగా 300కి పైగా విమానాలను రద్దు చేసింది. ఇండిగో రోజుకు 2,300కి పైగా విమానాలను నడుపుతోంది. దీన్ని బట్టి ఇండిగో మొత్తం విమానాల్లో ఏడు శాతం రద్దయ్యాయి.
పైలట్లు ఎంతసేపు పని చేయవచ్చనే దానిపై డీజీసీఏ అప్డేట్ చేసిన నవీకరించబడిన నియమాలు నవంబర్ 1 నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చాయి. ఇందులో పైలట్లు తక్కువ గంటలు విమానాలు నడపాలని, సహజంగా అలసిపోయినప్పుడు తెల్లవారుజామున వారికి తక్కువ డ్యూటీ సమయం కేటాయించాలని, వరుసగా ఎన్ని రాత్రులు పని చేయవచ్చనే దానిపైనా ఇప్పుడు పరిమితి విధించారు. పరిశ్రమ వర్గాల ప్రకారం, ఈ కఠినమైన దశ-2 నియమాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇండిగో తన పైలట్ల పని షిఫ్ట్లను సరిగ్గా ప్లాన్ చేయడానికి, షెడ్యూల్ చేయడానికి ఇబ్బంది పడుతోంది.






