EVs: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మార్కెట్‌లో భారత్ ఆధిపత్యం

by S Gopi |

ఫేమ్, పీఎం ఈ-డ్రైవ్ వంటి పథకాలు ఎలక్ట్రిక్, సాంప్రదాయ ఇంధన వాహనాల మధ్య ధరల వ్యత్యాసాన్ని తగ్గించడంలో విజయం సాధించాయి.

EVs: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మార్కెట్‌లో భారత్ ఆధిపత్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మార్కెట్లో భారత్ సత్తా చాటుతోంది. 2024లో అంతర్జాతీయంగా అమ్ముడిన ఈవీ త్రీ-వీలర్ అమ్మకాల్లో 57 శాతం వాటాతో ఆధిపత్యం సాధించింది. ఈ మేరకు బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరిగిన సీఓపీ30 కార్యక్రమం సందర్భంగా జీరో-ఎమిషన్ వెహికల్(జీఈవీ) పరివర్తనపై కొత్త పురోగతి పేరుతో విడుదలైన నివేదిక తెలిపింది. ఇది భారత్ ఇతర దేశాల కంటే మెరుగ్గా క్లీన్ మొబిలిటీ వైపు అడుగులు వేయడాన్ని సూచిస్తుందని, ప్రపంచ జీర్-ఎమిషన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లకు ప్రపంచం మారడానికి భారత్ కీలక డ్రైవర్‌గా నిలుస్తుందని నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు భారత ప్రభుత్వం ఫేమ్, పీఎం ఈ-డ్రైవ్ వంటి పథకాలు ఎలక్ట్రిక్, సాంప్రదాయ ఇంధన వాహనాల మధ్య ధరల వ్యత్యాసాన్ని తగ్గించడంలో విజయం సాధించాయి. ముఖ్యంగా లాస్ట్-మైల్ మొబిలిటీ విభాగంలో పెద్ద ఎత్తున ఈవీల వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులకు ఆజ్యం పోశాయి. పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 25 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, 3.2 లక్షల త్రీ-వీలర్ల అమ్మకాలు జరిగాయి. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ. 2,800 కోట్ల సబ్సిడీలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసింది. ఇదే క్రమంలో జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు 2030 నాటికి 100 శాతం ఈవీలకు మారేందుకు సిద్ధమవుతున్నాయి.

Next Story