11.4 శాతం పెరిగిన భారత కంపెనీల ఆదాయం!

by Disha Web Desk 17 |
11.4 శాతం పెరిగిన భారత కంపెనీల ఆదాయం!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి భారతీయ కంపెనీల ఆదాయం 11.4 శాతం పెరిగిందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. దేశవ్యాప్తంగా 579 కంపెనీల నుంచి సేకరించిన వివరాల ప్రకారం, డిమాండ్ పుంజుకోవడం, అన్ని రంగాల్లోని కంపెనీలు ధరలు పెంచడంతో ఆదాయం పెరిగింది. అయితే, త్రైమాసిక పరంగా చూస్తే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే చివరి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి 5.2 శాతం తగ్గింది.

ముఖ్యంగా విమానయానం, హోటళ్లు, ఓడరేవులు, రత్నాభరణాల రంగాల్లో ఆదాయం పుంజుకుందని నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణ ఒత్తిడి కొంత తగ్గినప్పటికీ ఖర్చులు పెరగడం, ఫారెక్ట్ రేట్ల కారణంగా కంపెనీల మార్జిన్ స్వల్పంగా 1.26 శాతం తగ్గిందని ఇక్రా కార్పొరేట్ విభాగం వైస్-ప్రెసిడెంట్ కింజల్ షా అన్నారు.

అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలగా కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీల మార్జిన్‌లపై ఒత్తిడి కనిపిస్తోంది. మెటల్, సిమెంట్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ వంటి కొన్ని రంగాల్లో మార్జిన్ ఎక్కువగా ఉంది. వివిధ రంగాల్లో సాధారణ ధరల పెరుగుదల, ఇన్‌పుట్ ఖర్చులు స్థిరంగా ఉండటం, సెమీకండక్టర్ల కొరత తగ్గి సరఫరా మెరుగ్గా ఉన్న కారణంగా రానున్న త్రైమాసికాల్లో కంపెనీల మార్జిన్ రికవరీకి అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది.

Also Read..

2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ!

Next Story

Most Viewed