తమిళనాడులో హ్యూండాయ్ రూ. 6,180 కోట్ల పెట్టుబడులు

by Dishanational1 |
తమిళనాడులో హ్యూండాయ్ రూ. 6,180 కోట్ల పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా దేశీయంగా భారీ పెట్టుబడులను ప్రకటించింది. తమిళనాడులో హైడ్రోజన్ రిసోర్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ కార్యకలాపాల కోసం తాజాగా రూ. 6,180 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు సోమవారం వెల్లడించింది. ఇదివరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం వచ్చే పదేళ్ల(2023-2032) కాలంలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు ఇది అదనమని పేర్కొంది. తాజా పెట్టుబడులకు సంబంధించి తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్-2024 కార్యక్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. 'ఈ పెట్టుబడి దేశ స్వావలంబనకు, రాష్ట్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కంపెనీ కట్టుబడి ఉందనేందుకు నిదర్శనమని' హ్యూండాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ అన్సూ కిమ్ అన్నారు. అలాగే, హైడ్రోజన్ టెక్నాలజీ వృద్ధికి, గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు ఈ పెట్టుబడులు అవసరమని చెప్పారు.


Next Story