- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టాక్ మార్కెట్లో భారీ కుదుపు.. 670 పాయింట్లకు పడిపోయిన సెన్సెక్స్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) నేడు భారీ నష్టాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో ట్రేడింగ్ ప్రారంభమైన కొ ద్దిసేపటికే సూచీలు భారీగా పతనం అయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్ (Sensex) 679 పాయింట్లు పతనమై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.
అదేవిధంగా నిఫ్టీ (NIFTY) కూడా 216 పాయింట్లు నష్టపోయి ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు డౌన్ ఫాల్ అవ్వడంతో దలాల్ స్ట్రీట్లో బేర్స్ హవా కొనసాగుతోంది. ప్రధానంగా ఐటీ (IT), బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం మార్కెట్ల పతనానికి కారణమైంది. అమెరికా మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు కూడా భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్ నిలకడ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని స్టాక్ మర్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.






