ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ సంస్థ ఛైర్మన్ కన్నుమూత!

by Disha Web Desk 17 |
ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ సంస్థ ఛైర్మన్ కన్నుమూత!
X

లండన్: ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థ హిందూజా గ్రూప్ ఛైర్మన్ ఎస్‌పీ హిందూజా కన్నుమూశారు. 87 ఏళ్ల వయసున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం లండన్‌లో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. 1952లో విద్యను పూర్తి చేసిన శ్రీచంద్ పర్మానంద్​ హిందూజా(ఎస్‌పీ హిందూజా), తన తండ్రి హిందూజా గ్రూప్ వ్యవస్థాపకుడైన పీడీ హిందూజాతో కలిసి కుటుంబ వ్యాపారంలో చేరారు.

బ్రిటిష్ జాతీయుడైన ఎస్‌పీ హిందూజాకు గోపీచంద్, ప్రకాష్, అశోక్ అనే ముగ్గురు సోదరులు, ఇద్దరు కుమార్తెలు షాను, వినూ ఉన్నారు. ఎస్‌పీ హిందూజా డిమెన్షియాతో బాధపడుతున్నారు. ఆయన భార్య మధు 2023, జనవరిలో మరణించారు. కాగా, ఇటీవల అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్‌ను టేకోవర్ చేసేందుకు జరిగిన రెండో రౌండ్ వేలంలో రూ. 9,650 కోట్లతో హిందూజా గ్రూప్ సంస్థ అత్యధిక బిడ్డర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Also Read..

EV ఫాస్ట్ ఛార్జర్‌ల ఏర్పాటు కోసం షెల్ ఇండియాతో హ్యూండాయ్ ఒప్పందం!

Next Story

Most Viewed