- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
Finance Ministry: అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలర్ట్

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఏవైనా ఊహించని పరిణామాలను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని బ్యాంకులకు సూచించారు. అన్ని బ్యాంకులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సంఘటన లేదా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. పౌరులు, వ్యాపారాలకు బ్యాంకింగ్, ఆర్థిక సేవలను అంతరాయం లేకుండా చూసుకోవాలి' అని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అన్ని బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంతరాయం లేకుండా బ్యాంకింగ్ సేవలను అందించడానికి బ్యాంకింగ్ రంగం సైబర్ భద్రతను సమీక్షించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. భౌతిక, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు రెండూ అంతరాయం లేకుండా పనిచేయాలని, ఏటీఎంలలో నగదు లభ్యతను, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను, ఇతర ముఖ్యమైన బ్యాంకింగ్ సౌకర్యాలు నిరంతరం పనిచేయాలని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగుల భద్రతపై నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. వారి రక్షణ కోసం సెక్యూరిటీ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని బ్యాంకులకు సూచించారు.
సైబర్ దాడికి అంతా సిద్ధం
ఈ సమావేశంలో దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తానికి సైబర్ సెక్యూరిటీ అత్యంత బలంగా ఉందని బ్యాంకింగ్ యూనియన్ నేతలు చెప్పారు. పెద్ద ఎత్తున సైబర్ దాడులు ఎదురైనప్పటికీ రక్షణ కల్పించేందుకు యాంటీ-డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్-ఆఫ్-సర్వీస్(డీడీఓఎస్) వ్యవస్థను అమలు చేశామని, ఇందుకు అవసరమైన మాక్ డ్రిల్ కూడా నిర్వహించినట్టు వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫిషింగ్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్టు, సిబ్బందికి అవగాహన పెంచేందుకు తగిన హెచ్చరికలు జారీ చేశామని పేర్కొన్నారు. ఇలాంటి అనిశ్చిత సమయాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అన్ని బ్యాంకులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
READ MORE ...
ఇండియా పాక్ ఉధ్రిక్తతలు..బ్యాంకులకు నిర్మలమ్మ కీలక ఆదేశాలు