దసరాకు మరో భారీ సేల్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ !

by Dishanational4 |
దసరాకు మరో భారీ సేల్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ !
X

బెంగళూరు: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ సందర్భంగా ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఇటీవలే ముగిసింది. తాజాగా దసరా పండుగను పురస్కరించుకుని మరో భారీ సేల్‌ను ప్రకటించింది. ఈ నెల 5-8వ తేదీల మధ్య 'బిగ్ దసరా సేల్ 'ను నిర్వహించనున్నట్టు తెలిపింది. గత నెలలో నిర్వహించిన సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రాయితీలు ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్, దసరా సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్యం చేసుకున్నట్టు పేర్కొంది. మునుపటిలాగే, ప్లస్ మెంబర్‌షిప్ ఉన్న వినియోగదారులు ఒక రోజు ముందుగానే, అంటే అక్టోబర్ 4న ఆఫర్‌లను పొందడానికి అవకాశం ఉంటుంది.

నాలుగు రోజుల పాటు జరిగే దసరా సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు కంప్యూటర్ యాక్సెసరీస్, ఫ్రిజ్, టీవీలు, హెడ్‌ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, దాని యాక్సెసరీస్, ఇంకా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లు, ఆఫర్లను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. పరిశ్రమ వర్గాల ప్రకారం బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఉన్న ఆఫర్లనే దాదాపుగా కొనసాగించవచ్చని తెలుస్తోంది. ఆ సేల్‌లో ఔటాఫ్ స్టాక్, ఇతర కారణాలతో ఉత్పత్తులను కొనలేకపోయిన వినియోగదారులకు దసరా సేల్‌లో కొనేందుకు అవకాశం ఉండనుంది. ఏ ఏ ఉత్పత్తులపై ఎలాంటి ఆఫర్లు ఉండనున్నాయనే విషయంలో సేల్ ప్రారంభమైన రోజు బహిర్గతం కానున్నాయి.


Next Story

Most Viewed