- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలాన్ మస్క్ కంపెనీకి భారత్లో కీలక అనుమతులు
ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్టార్ లింక్కు భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన కీలక అనుమతులు లభించాయి.

దిశ, వెబ్ డెస్క్: ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్టార్ లింక్కు భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన కీలక అనుమతులు లభించాయి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ (IN-SPACe) తాజాగా కమర్షియల్ సేవల కోసం అనుమతులను మంజూరు చేసినట్టు రాయిటర్స్ తెలిపింది. 2022 నుంచి కమర్షియల్ లైసెన్స్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ లింక్కు చివరికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఇప్పటికే గత నెలలో టెలికాం విభాగం నుంచి కూడా అనుమతులు అందుకున్న స్టార్ లింక్కు ఇప్పుడు స్పేస్ ఏజెన్సీ ఆమోదంతో దేశంలో తమ సేవలను ప్రారంభించే దారిని సమతుల్యం చేసుకుంది. వన్వెబ్, రిలయన్స్ జియో వంటి కంపెనీలకు ఇలాంటి అనుమతులు ముందే లభించిన విషయం తెలిసిందే.
అయితే, వాణిజ్య సేవలు అందుబాటులోకి తేవడానికి ఇంకా కొన్ని దశలు మిగిలే ఉన్నాయి. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ కేటాయింపు, బేస్ స్టేషన్లకు మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు, తమ సేవలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిరూపించేందుకు ట్రయల్లు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలు పూర్తయ్యాకే సామాన్య ప్రజలకు స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.






