దేశీయ మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ విడుదల

by Disha Web Desk 17 |
దేశీయ మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టార్టప్ కంపెనీ 'మేటర్' కొత్తగా భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఇది అహ్మదాబాద్‌ ప్లాంట్ నుండి అధికారికంగా లాంచ్ అయింది. సరికొత్త డిజైన్‌తో గేర్‌లు కలిగిన ఎలక్ట్రిక్ వేరియంట్ బైక్ దేశీయ రైడర్స్‌కు బాగా నచ్చుతుందని కంపెనీ పేర్కొంది. గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. బైక్ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ CEO మోహల్ లాల్‌భాయ్ అన్నారు.

బైక్ సాధారణ కనెక్టర్ ద్వారా స్టాండర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. బైక్‌లో స్టాండర్డ్ ఆన్‌బోర్డ్ 1-కిలోవాట్ ఛార్జర్, మ్యాటర్‌ఛార్జ్ 1.0 అమర్చారు. ఏదైనా 5A, 3-పిన్ ప్లగ్ పాయింట్ వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఆన్‌బోర్డ్ ఛార్జర్ 5 గంటలలోపు వాహనాన్ని ఛార్జ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి : కొత్తగా టియాగో మోడల్స్‌ను ప్రారంభించిన టాటా మోటార్స్



Next Story

Most Viewed