- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశాలను కాదని అనంత్ అంబానీ పెళ్లి ఇండియాలోనే ఎందుకు చేసుకుంటున్నాడు.. కారణం మోడీనేనా?
అపర కుభేరుడు అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే ఫ్రీ వెడ్డింగ్ వేడుకలను ఎంత ఘనంగా చేశారో మనకు తెలిసిందే. వీరి పెళ్లి వేడుకలకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరై, సందడి చేశారు.

దిశ, ఫీచర్స్ : అపర కుభేరుడు అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే ఫ్రీ వెడ్డింగ్ వేడుకలను ఎంత ఘనంగా చేశారో మనకు తెలిసిందే. వీరి పెళ్లి వేడుకలకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరై, సందడి చేశారు. ఇక జూలై12న వీరి వివాహం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరగనుంది.ఈక్రమంలో వీరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఏంటీ అనుకుంటున్నారా?
అనంత్ అంబాని వివాహం సాంప్రదాయ పద్ధతిలో భారత్లో జరగనుంది. అయితే ఆయన ఈ వివాహాన్ని ఇండియాలోనే జరపడానికి ఓ కారణం ఉన్నదంట. ఈ రోజుల్లో చాలా మంది తమ వివాహాన్ని ఇతర దేశాలలో చాలా ఘనంగా చేసుకుంటున్నారు. కానీ అనంత్ అంబానీ మాత్రం తన పెళ్లి భారత్లో జరగాలని, తన తండ్రిని కోరాడంట. దీనికి కారణం,మోడీనే అంటున్నారు కొందరు.
అయితే మోడీ వెన్ ఇన్ ఇండియా పిలుపుతో స్పూర్తి పొందిన అనంత్ అంబానీ తన పెళ్లిని భారత్లోనే, ప్రపంచంలో అతిపెద్ద వివాహ వేడుకల్లో ఒకటిగా మార్చాలని నిర్ణయించుకున్నాడంట. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా, కని విని ఎరుగని రేంజ్లో భారత్లోనే అతి పెద్ద రాయల్ వెడ్డింగ్లలో ఇది రూపుదిద్దుకోనున్నదంట.






