శుభవార్త చెప్పిన సీఎం.. రూ. 500కే గ్యాస్ సిలిండర్

by Disha Web Desk 2 |
శుభవార్త చెప్పిన సీఎం.. రూ. 500కే గ్యాస్ సిలిండర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్ ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని 14 లక్షల కుటుంబాలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఇందిరా గాంధీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్ కింద సోమవారమే సిలిండర్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఒక్కో సిలిండర్‌పై రూ.640 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం జోధ్‌పూర్‌లో పర్యటించిన సీఎం గెహ్లాట్ ఈ ప్రకటన చేశారు. గతంలో తాను ఇచ్చిన హామీకి అనుగుణంగా తాజా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వాస్తవానికి.. రాష్ట్రంలో 80 లక్షల కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయని.. అయితే, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన గణాంకాలు రాలేదని తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం అర్హులను గుర్తించి, ప్రస్తుతానికి 14 లక్షల కుటుంబాలకు సిలిండర్ సబ్సిడీ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీపై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడేందుకు విపక్షాల వద్ద ఏమీ లేదని అన్నారు. తాము ప్రవేశపెట్టిన పథకాలు.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాదని, శాశ్వతంగా ఉంటాయని అన్నారు. మోడీ అహంకారం, మొండి పట్టుదల వల్లే ఇటీవల హిమాచల్​ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed