గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్

by Disha Web Desk 9 |
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించారు. తాజాగా ఈయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ ధరలు రూ.200 సబ్సిడీ అందిస్తోందని.. కరోనా సమయంలో బలహీన వర్గాలు, దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి సర్కారు మద్ధతు ఇచ్చిందని వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సిలిండర్ ధరలు తగ్గించే ఆలోచనలో ఉందని తెలిపారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ సామాన్య ప్రజలకు కాస్త ఊరట కలిగించే విషయం చెప్పడంతో జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్: రూ. 1, 155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114



Next Story

Most Viewed