- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Haier India: హైయర్ ఇండియాలో 49 శాతం వాటాను కొనుగోలుకు ఎయిర్టెల్ చర్చలు

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ చైనాకు చెందిన గృహోపకరణాల బ్రాండ్ హైయర్కు చెందిన ఇండియా యూనిట్ హైయర్ ఇండియాలో 49 శాతం వాటా కొనేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ఒప్పందం విలువ 2 బిలియన్ డాలర్లు(రూ. 17 వేల కోట్ల) పైనే ఉంటుంది. ఈ ఒప్పందం విషయంపై ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పుంకస్ను సంప్రదిస్తున్నారు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, మరికొన్ని వారాల్లో ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంకా తుది నిర్ణయం జరగలేదని, హైయర్ కంపెనీ వాటా విక్రయం విషయంలో ఆలోచనలో ఉందని తెలుస్తోంది. కాగా, భారత మార్కెట్లో హైయర్ కంపెనీకి మూడు చోట్ల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో ఎయిర్ కండిషనర్లు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర ఉపకరణాల వంటి ఉత్పత్తుల తయారీ జరుగుతుంది. పలు నివేదికల ప్రకారం, హైయర్ కంపెనీ భారత మార్కెట్లో విస్తరణకు స్థానిక పెట్టుబడిదారుల కోసం ప్రయత్నిస్తోంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సైతం గణనీయమైన వాటా కొనవచ్చనే ఊహాగానాలు వినిపించాయి.