యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్‌కు షాకిచ్చిన RBI

by Disha Web Desk 17 |
యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్‌కు షాకిచ్చిన RBI
X

దిశ, వెబ్‌డెస్క్: యాక్సిస్ బ్యాంక్, బంగారంపై రుణాలు ఇచ్చే మణప్పురం ఫైనాన్స్‌కు జరిమానాతో ఆర్‌బీఐ షాకిచ్చింది. బ్యాంకింగ్ మార్గదర్శకాలను పాటించనందుకు యాక్సిస్ బ్యాంక్‌కు రూ.90.92 లక్షల పెనాల్టీ విధించింది. యాక్సిస్ బ్యాంక్‌ ఖాతాదారుల గుర్తింపు, వారి అడ్రస్‌లకు సంబంధించిన రికార్డులను భద్రపరచడంలో విఫలమైంది. అలాగే, రిస్క్ మేనేజ్‌మెంట్, కరెంట్ ఖాతాలు తెరిచే సమయంలో బ్యాంకు ఖాతాదారుల నుంచి డిక్లరేషన్లు తీసుకోకపోవడం వంటి మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ జరిమానా విధించారు. అలాగే, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి సంబంధించిన ఆర్‌బీఐ నిబంధనలు పాటించనందుకు మణప్పురం ఫైనాన్స్‌కు రూ. 42.78 లక్షల జరిమానా విధించారు.


Next Story

Most Viewed