భారత్‌లో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్ ప్రారంభం

by Disha Web Desk 2 |
భారత్‌లో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్ ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో వేగంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న యాపిల్.. దేశంలో తొలి రిటైల్ స్టోర్‌ను మంగళవారం ప్రారంభించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 'యాపిల్ బీకేసీ' పేరుతో ఈ స్టోర్‌ను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టిమ్ కుక్ స్వయంగా స్టోర్ తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు. ఈ స్టోర్‌ను ప్రారంభించేందుకు కుక్ సోమవారమే ముంబై చేరుకున్నారు. 20,800 చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో కస్టమర్లు యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇతర సేవలను కూడా పొందవచ్చు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా యాపిల్‌కు 500 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ మార్కెట్లపై దృష్టి సారించిన యాపిల్ ముంబై తర్వాత ఏప్రిల్ 20న ఢిల్లీలో రెండో రిటైల్ స్టోర్ లాంచ్ చేయబోతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed