డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. 12 మందికి గాయాలు

by  |
డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. 12 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పాతటోల్‌పాజ్లా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed