లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి

by  |
లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహారాష్ట్రలోని నందుర్ బార్ దగ్గర కొండైబరి ఘాట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు 40 అడుగుల లోయలో పడి నలుగురు మృతిచెందారు. మరో 35 మందికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు సమాచారం. ఈ ఘటన మహారాష్ట్ర నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed