బురుఖాను బ్యాను చేయండి.. మంత్రి షాకింగ్ కామెంట్స్

by  |
బురుఖాను బ్యాను చేయండి.. మంత్రి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు బురఖాలు ధరించడం దుష్ట ఆచారమని, అమానవీయమని శుక్లా పేర్కొన్నారు. మహిళలు బురఖాలు ధరించడంపై నిషేధం విధించాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే పలు ముస్లిం దేశాలు బురఖాలను నిషేధించాయని వెల్లడించారు.

దేశంలో ట్రిపుల్ తలాఖ్‌ను ఎలా నిషేధించగలిగామో అలానే బురుఖాపై కూడా నిషేధం విధించాలని అన్నారు. ఇటీవలే మంత్రి శుక్లా.. మసీదుల్లో మైకులు, లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు విధించాలని బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

రోజుకు ఐదు సార్లు నమాజ్‌ను మైకులో వినిపించడం వల్ల యోగా, ధ్యానం, ప్రార్థనలు, ఇంకేవైనా అధికారిక కార్యక్రమాలు చేసేవారికి ఆటంకం కలుగుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed