- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : యూపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు బురఖాలు ధరించడం దుష్ట ఆచారమని, అమానవీయమని శుక్లా పేర్కొన్నారు. మహిళలు బురఖాలు ధరించడంపై నిషేధం విధించాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే పలు ముస్లిం దేశాలు బురఖాలను నిషేధించాయని వెల్లడించారు.
దేశంలో ట్రిపుల్ తలాఖ్ను ఎలా నిషేధించగలిగామో అలానే బురుఖాపై కూడా నిషేధం విధించాలని అన్నారు. ఇటీవలే మంత్రి శుక్లా.. మసీదుల్లో మైకులు, లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు విధించాలని బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
రోజుకు ఐదు సార్లు నమాజ్ను మైకులో వినిపించడం వల్ల యోగా, ధ్యానం, ప్రార్థనలు, ఇంకేవైనా అధికారిక కార్యక్రమాలు చేసేవారికి ఆటంకం కలుగుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Next Story