సంగారెడ్డిలో చైనా వస్తువుల దహనం

by  |
సంగారెడ్డిలో చైనా వస్తువుల దహనం
X

దిశ, మెదక్: విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ వాహిని సంస్థల ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డిలో చైనా వస్తువుల బహిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు స్థానిక ఐబీ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు అమరవీర జవానులకు నివాళులర్పించారు. అనంతరం చైనా వస్తువులను బహిష్కరిస్తామని ప్రమాణం చేశారు. చైనా దేశ జాతీయ పతాకంతో పాటు అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మ, చైనా వస్తువులను దహనం చేశారు. పట్టణంలోని దుకాణ యజమానులను చైనా వస్తువుల క్రయ విక్రయాలను చేయరాదని కోరారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ రాష్ట్ర కో కన్వీనర్ సుభాష్ చందర్, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు గడిల శ్రీధర్ గౌడ్, జిల్లా కార్యదర్శి ప్రకాశం, జిల్లా సహాయ కార్యదర్శి ద్వారక రవి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed