కుటుంబానికంతా కరోనా.. దొంగలు ఏం చేశారంటే..

by  |
కుటుంబానికంతా కరోనా.. దొంగలు ఏం చేశారంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి మూలంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే, మరోపక్క దొంగలు చెలరేగిపోతున్నారు. కరోనా బారిన పడి కుటుంబం మొత్తం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుంటే, ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటుచేసుకుంది.

వివరాళ్లోకి వెళితే… గుంతకల్లులోని ఓ కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అందరూ అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఇంట్లోకి దొంగలు చొరబడి రూ.3లక్షలు నగదు, 8 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్‌ రాగా.. చికిత్స పొందుతూ కుటుంబ పెద్ద సుబ్రహ్మణ్యం మృతిచెందారు. మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.


Next Story