ఢిల్లీ పర్యటనలో బండి సంజయ్

by  |
ఢిల్లీ పర్యటనలో బండి సంజయ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శనివారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగిడిలను వేర్వేరుగా కలిసి తెలంగాణకు దక్కాల్సిన నిధులు, పనులు, ప్రాజెక్టులపై చర్చించారు. పలు మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులకు విడుదల చేస్తున్నకేంద్రం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను సమయానుకూలంగా అందించకపోవడంతో డెవలప్‌మెంట్ కుంటుపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ రైతుల జీవితాలను మార్చే పథకమని బండి సంజయ్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed