- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి కిన్నెర మొగిలయ్య ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇదే తరహాలో మొగిలయ్య టీఎస్ఆర్టీసీ ప్రయాణంపై పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆర్టీసీ అధికారులు ఆయనను బస్ భవన్కు పిలిపించుకొని సన్మానించారు. ఈ సందర్భంగా మొగిలయ్యకు ఆర్టీసీ అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ఇకపై మొగిలయ్య రాష్ట్రంలో ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం ఇచ్చారు. ఆర్టీసీ అధికారుల నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు మొగిలయ్య. ఇదిలా ఉండగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన ఆర్టీసీలో వినూత్న మార్పులు తీసుకువస్తున్నారు. దీంతో ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తోక ముడిచిన కేసీఆర్.. సీఎంకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరకలేదా.?
కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య తన కూతురు వివాహానికి @TSRTCHQ బస్ బుక్ చేసుకొన్నాడు. మొగులయ్య తన అనుభవాన్ని పాట రూపంలో పంచుకున్నాడు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం మంచిదంటూ కిన్నెర మొగులయ్యగానం చేస్తున్న వీడియోను ఆర్టీసీ అధికారులు ట్విట్టర్లో షేర్ చేశారు.@tsrtcmdoffice pic.twitter.com/WoB8JtKgXJ
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 22, 2021