హుజూరాబాద్‌లో ఈటలదే గెలుపు: బుక్క వేణుగోపాల్

by  |
హుజూరాబాద్‌లో ఈటలదే గెలుపు: బుక్క వేణుగోపాల్
X

దిశ రాజేంద్రనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బుక్క వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ప్రచారం నిర్వహించిన ఆయన బుధవారం శంషాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. అధికారం అడ్డంపెట్టుకుని పోలీసులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అమలుకాని హామీలతో మరోసారి ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని.. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు బుక్క ప్రవీణ్, కౌన్సిలర్ కొండ ప్రవీణ్ గౌడ్, అశోక్, మేండే కుమార్, ప్రకాష్, మాధవ రెడ్డి, మల్లేష్, వినోద, విరేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed