అర్ధరాత్రి బిల్డర్ దారుణ హత్య.. ఆ వ్యవహారమే కారణమా..?

by  |
Murder
X

దిశ, వెబ్‌డెస్క్ : విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. విజయవాడలోని వాంబే కాలనీలో నివాసం ఉంటున్న ఓ బిల్డర్‌ను దుండగులు ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్క సారిగా అటాక్ చేసి కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశారు. మృతుడు పీతల అప్పలరాజుగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు. వ్యాపారంలో లావాదేవీల కార‌ణంగా ఈ హ‌త్య జ‌రిగిందా లేదంటే ఇత‌ర కార‌ణాలు ఏమైనా ఉన్నాయా అన్న దిశ‌గా విచార‌ణ జ‌రుపుతున్నారు. అయితే కుటుంబం విశాఖపట్నంలో ఉండగా, వ్యాపారం నిమిత్తం అప్పలరాజు విజయవాడలో ఒంటరిగా నివాసం ఉంటున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed