- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. విజయవాడలోని వాంబే కాలనీలో నివాసం ఉంటున్న ఓ బిల్డర్ను దుండగులు ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్క సారిగా అటాక్ చేసి కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశారు. మృతుడు పీతల అప్పలరాజుగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు. వ్యాపారంలో లావాదేవీల కారణంగా ఈ హత్య జరిగిందా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న దిశగా విచారణ జరుపుతున్నారు. అయితే కుటుంబం విశాఖపట్నంలో ఉండగా, వ్యాపారం నిమిత్తం అప్పలరాజు విజయవాడలో ఒంటరిగా నివాసం ఉంటున్నట్టు సమాచారం.
Next Story