పోలవరానికి రూ.55,549 కోట్లు ఇవ్వండి !

by  |
పోలవరానికి రూ.55,549 కోట్లు ఇవ్వండి !
X

దిశ, ఏపీ బ్యూరో: 2013భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరిగినందున తుది అంచనా ప్రకారం రూ.55,548.87 కోట్లు ఇవ్వాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీయై గంటకు పైగా చర్చించారు. 2013-14అంచనాల ప్రకారం రూ.20,398.61 కోట్లు వ్యయంగా పరిగణించడం సరికాదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును తామే నిర్మిస్తామని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పునరావాసం, భూసేకరణ వ్యయం కేంద్రానిదేనని చట్టంలో పేర్కొన్నట్లు బుగ్గన తెలిపారు.



Next Story

Most Viewed