గుంటూరు జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థిని దారుణ హత్య

by  |
murder
X

దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దకాకాణి రోడ్డులో బీటెక్ విద్యార్థిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని నల్లపు రమ్యగా పోలీసులు గుర్తించారు. అనంతరం యువతి మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. హత్యచేసిన యువకుడికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో గుంటూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


Next Story

Most Viewed