బహుజనులకు రాజ్యాధికారం రావాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by  |
బహుజనులకు రాజ్యాధికారం రావాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: బహుజనులకు రాజ్యాధికారం వచ్చేంతవరకు పోరాటాలు చేస్తామని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం మేడ్చెల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ రాంపల్లి ఎక్స్ రోడ్ లో బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. సైనికపురి చౌరస్తా నుంచి నాగారం వరకు కార్యకర్తల తో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో బీఎస్పీ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు నిర్విరామంగా పని చేయాలని, ప్రతి గడపకు వెళ్లి పార్టీ గుర్తును పరిచయం చేయాలని కోరారు.

ఈ బానిసత్వ, భావజాలంలో నుండి బయటపడి గొప్ప నాయకులుగా తయారుకావాలన్నారు. వివిధ పార్టీల నుండి అనేక మంది యువ కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీ లో చేరారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు శీలం అనితారెడ్డి, రామచందర్, రాజయ్య, జిల్లా అధ్యక్షుడు గౌడ సుదర్శన్, కోశాధికారి రవీంద్రనాయక్, జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీహరి చారి, ఉపాధ్యక్షుడు ప్రాభాకర్ చారి, జిల్లా నాయకులు ఎర్రవెల్లి మల్లేష్, మేడ్చెల్ నియోజకవర్గ ఇంచార్జ్ సుక్క దాయానంద్, ఉపాధ్యక్షులు చీర్యాల బోడ జంగయ్య, వివిధ మండలాల నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Next Story

Most Viewed