దారుణం.. తల్లి, తమ్ముడిని కిరాతకంగా హత్య చేసిన అన్న

by  |
murder, Kandagatla village
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో తమ్ముడు తూర్పటి శ్రీను(30), తల్లి తూర్పటి మారమ్మ(70) లను అన్న లక్ష్మయ్య కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామంలో చోటుచేసుకుంది. తల్లీతమ్ముడ్ని హత్య చేసిన నిందితుడు లక్ష్మయ్య పరారీలో ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.



Next Story