నడిరోడ్డుపై తలనరికి వెంట తీసుకెళ్లారు..

by  |
నడిరోడ్డుపై తలనరికి వెంట తీసుకెళ్లారు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రం మధురైలో దారుణ హత్య కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులపై కొందరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువకుడి మొండెం వేరు చేసి తల తీసుకుని వెళ్లిపోయారు. ఈ దాడిలో మరోవ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడిని మురుగనందంగా గుర్తించారు.

పాత కక్ష్యల నేపథ్యంలో ఈ గ్యాంగ్ వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. కాగా, గాయాలపాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా అందరినీ భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed