బ్రిటన్ నుంచి భారత్‌కు చేరిన మెడికల్ ఎక్విప్‌మెంట్

by  |
బ్రిటన్ నుంచి భారత్‌కు చేరిన మెడికల్ ఎక్విప్‌మెంట్
X

న్యూఢిల్లీ: కరోనా వేళ భారత్‌కు తమ వంతు సాయంగా బ్రిటన్ పంపిన వైద్య సామాగ్రి మంగళవారం న్యూఢిల్లీకి చేరాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ‘ బ్రిటన్ పంపిన వైద్య సామగ్రి న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఇందులో 100 వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్‌ ఉన్నాయి’అని పేర్కొంది. భారత్‌కు మొత్తం 120 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లతో పాటు 495 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్‌ భారత్‌కు పంపనుంది. ఇందులో భాగంగా తొలి ప్యాకేజీ ఢిల్లీకి చేరుకుంది.

Next Story

Most Viewed