ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్..!

by  |
ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : అందంగా, అద్భుతంగా ఫోటోలు తీయించుకోవాలనే సరదా కాస్త కాబోయే నవదంపతుల ప్రాణాలను బలిగొన్నది. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసమని కావేరి నదిలో బోటులో వెళ్లిన ఈ జంట తిరిగి రాలేదు. ప్రమాదవ శాత్తు బోటు బోల్తా పడి నదిలో మునిగిపోవడంతో పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఇద్దరూ విగతజీవులుగా మారారు. ఈ విషాదకరమైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో బుధవారం వెలుగులోకి వచ్చింది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే ఫోటోగ్రాఫర్ అందించిన సమాచారం మేరకు అక్కడి వారు మరో పడవలో వెళ్లి మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చారు.

ఈ విషయం ఇరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మరికొద్ది రోజుల్లోనే వీరికి విహహాం జరగాల్సి ఉండగా, అంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదని బాధిత కుటంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన జరిగిన నది ప్రాంతానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Next Story