సంచలన ఘటన.. తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణ హత్య

by Dishanational2 |
సంచలన ఘటన.. తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణ హత్య
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. కొత్తపల్లి వీఆర్‌ఏగా పనిచేస్తున్న దుర్గంబాబును దుండగులు హత్య చేశారు. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. రక్తపు మడుగులో ఉన్న దుర్గంబాబును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు. దారుణ హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన కన్నెపల్లి మండలంలో సంచలనంగా మారింది. హత్యపై పోలీసులు విచారణ చేపట్టారు దుండగులు ఎవరనేది కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

Next Story

Most Viewed