గూండాల వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
గూండాల వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : అవిశ్వాసాలతో తమ బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరూ ఏమి చేయలేరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదారాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపాలిటీల్లో తన నాయకులను కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాలకు ఉసిగొల్పుతోందని ఆరోపించారు. అవిశ్వాసలతో బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేదని, ప్రజల గుండెల్లో తమ నాయకుడు చిరస్థాయిగా నిలిపోయాడని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎంలా కాకుండా ఓ గూండాల మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్‌ను వెయ్యి మీటర్ల లోతున పాతిపెట్డడం కాదు.. అసలు కాంగ్రెస్ పార్టీనే వెయ్యి మీటర్ల లోతున ఉందని ఎద్దేవా చేశారు. అదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ అధకారంలోకి వచ్చిందని సెటైర్లు వేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.


Next Story