BREAKING : టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్‌ తనోబా రాజీనామా

by Disha Web Desk 1 |
BREAKING : టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్‌ తనోబా రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువదీరిన వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్‌ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. పేపర్ లీకేజీతో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె ఇవాళ గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందజేశారు. కొందరి వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల వల్లే సంస్థపై మాయనిమచ్చ పడిందని, అందులో తన ప్రమేయం కానీ, సభ్యుల ప్రయేయం లేదని తెలిపారు. కానీ, టీఎస్‌పీఎస్‌సీ కమిషన్ ప్రక్షాళన పేరుతో తమను అనుమానించడం తీవ్రంగా బాధించిందని సుమిత్రానంద్ పేర్కొన్నారు. నిరుద్యోగలుకు ఉద్యోగాలు కల్పించాలన్న తమ ఆశయం సరిగ్గానే ఉన్నా.. నియామక ప్రక్రియను సజావుగా జరపలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed