ఇంటింటి రేషన్‌ పంపిణీకి బ్రేక్

by  |
ఇంటింటి రేషన్‌ పంపిణీకి బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఇంటింటి రేషన్‌ పంపిణీకి బ్రేక్ పడింది. ఎండీయూల ఆకస్మిక సమ్మెతో రేషన్ పంపిణీ నిలిచిపోయింది. ఇటీవల ఎండీయూలకు సరుకు ఇచ్చే క్రమంలో కరోనా సోకి విజయవాడలోనే ముగ్గురు డీలర్లు మృతి చెందారు. దీంతో వ్యాక్సిన్ పంపిణీ, ఇతర డిమాండ్‌లను అమలు చేసేవరకు విధులకు రామని ఎండీయూలు సమ్మె చెపట్టారు.

ప్రభుత్వం దిగి వచ్చేవరకు విధులకు హాజరు కాబోమన్న ఎండీయూలు చెబుతున్నారు. దీంతో మూడ్రోజులుగా రేషన్ పంపిణీ ఆగిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

Next Story

Most Viewed