జనవరిలో ‘బ్రహ్మస్త్ర’ లాస్ట్ షెడ్యూల్

by  |
జనవరిలో ‘బ్రహ్మస్త్ర’ లాస్ట్ షెడ్యూల్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన ‘బ్రహ్మాస్త్ర’ చివరి షెడ్యూల్ కోసం మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. అయాన్ ముఖర్జీ ‌డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోగా.. విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్ ఇతర పనులను మూవీ యూనిట్ ఆల్రెడీ పూర్తి చేసింది. కాగా ఇప్పుడు మిగిలిన పది రోజుల షూటింగ్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

ఈ పది రోజుల షూట్‌లో రణ్‌బీర్, నాగార్జున, ఆలియా, మౌనీరాయ్‌‌‌ల మీద రెండు పాటల చిత్రీకరణ జరగనుందని సమాచారం. ఈ సాంగ్స్‌కు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్స్ అవసరముండగా.. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత జనవరి 2021లో షూటింగ్ జరగనుందని టాక్. కాగా ఇప్పటికే 183 రోజుల పాటు షూటింగ్ చేసిన బ్రహ్మాస్త్ర టీమ్.. ఈ షెడ్యూల్‌తో 200 రోజులకు రీచ్ కానుంది. ప్రస్తుతం మనాలీలో వైల్డ్ డాగ్ షూటింగ్‌లో ఉన్న నాగ్.. మరో పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది.

Next Story

Most Viewed