బాలుడి ప్రాణం తీసిన ఫ్రీ ఫైర్ గేమ్

by  |
బాలుడి ప్రాణం తీసిన ఫ్రీ ఫైర్ గేమ్
X

దిశ, వెబ్‎డెస్క్ : ఆన్ లైన్ గేమ్ ఆడొద్దంటూ తల్లి మందలించిందని 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కడలి గ్రామానికి చెందిన బాలుడు ప్రసాద్ లాక్‎డౌన్‎లో ఫ్రీ ఫైర్ గేమ్‎కు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఫోన్‎లో గేమ్స్ ఆడుతున్నాడని కొడుకును తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story