ప్రియురాలి కోసం దేశాన్ని వీడాడు.. ఆమె చేసిన పనికి ప్రాణాల్ని వదిలాడు

by  |
ప్రియురాలి కోసం దేశాన్ని వీడాడు.. ఆమె చేసిన పనికి ప్రాణాల్ని వదిలాడు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : విలేజ్ ప్రేమల్లో కనిపించిన స్వచ్ఛత.. సిటీకి వచ్చేసరికి మారిపోతుంటాయనేది వాస్తవం. ఎందుకంటే ఇక్కడి కల్చర్ మనుషులను త్వరగా డైవర్ట్ చేస్తుంటుంది. అందుకే చాలా మంది సిటీ ప్రేమల కంటే విలేజ్ ప్రేమల మీదే ఆసక్తి చూపిస్తారు. నమ్మకం పెట్టుకుంటారు. కానీ, అదంతా వుత్తముచ్చటే అని ఓ ప్రియురాలు ప్రూవ్ చేసింది. ప్రేమించిన వాడిని కాదని వేరే వ్యక్తితో ప్రేమాయణం నడిపించింది. విషయం తెలిసుకున్న ప్రేమికుడు తను అంతగా నమ్మిన వ్యక్తి చేసిన మోసాన్ని భరించలేక తనువు చాలించాడు.

అంతకుముందు వీరిద్దరు ప్రేమించుకున్న విషయం ఇంట్లో తెలియడంతో గొడవలు జరిగాయి. పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకోవాలంటే ముందు జీవితంలో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయిన యువకుడు పనికోసం బహ్రెయిన్ కు పయనమయ్యాడు. కొన్ని రోజులు ఇద్దరూ ఫొన్ ద్వారానే యోగక్షేమాలు తెలుసుకుంటూ వచ్చారు. తీరా ఏమైందో తెలీదు. ప్రియురాలు వేరే వ్యక్తితో కాంటాక్ట్ లో ఉందని తెలిసి ఈ నెల 15న తాను పనిచేసే చోట క్యాంపులో ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. చివరగా అతను మామా వరుసయ్యే వ్యక్తి ఫొన్‌కు వాయిస్ మెస్సెజ్ పెట్టాడు. అందులో తన చావుకు ప్రేమించిన యువతి తనను మోసం చేయడమే కారణమని పేర్కొన్నాడు. ఈ ఘటనపై యువకుడి తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లా మాక్లుర్ పోలిస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. మృతుడి బాడీ రెపో మాపో ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది.

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రాంచంద్రంపల్లికి చెందిన ఇండ్ల సుధీర్, అదే గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. విషయం తెలియడంతో ఇరు ఇళ్లల్లో గొడవలు జరిగాయి. దీంతో జీవితంలో సెటిల్ కావాలని అతడు గల్ఫ్ కంట్రీకి వెళ్లాడు. అదే సమయంలో యువతి దగ్గరి బంధువు ఒకరు అమెకు దగ్గరయ్యాడు. అతడికి ఇదివరకే పెండ్లయి పిల్లలు ఉన్నారని సమాచారం.తన ప్రేయసిని తెలివిగా ట్రాప్ చేశాడని తెలుసుకున్నాడు. తనకు తెలిసిన వారి సాయంతో వారిద్దరూ మాట్లాడుకుంటున్న వాయిస్ సంభాషణలను సంపాదించి విన్నాడు. దీంతో కలత చెందిన సుధీర్ ప్రియురాలి చేతిలో మోసపోయానని, వారిద్దరికీ శిక్ష పడాలని లేకపోతే తన చావు రోజున వారిద్దరికీ పెండ్లి జరిపించాలని మామ ఫొన్‌కు మెస్సెజ్ పెట్టి అత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం మాక్లూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. యువకుడు బహ్రెయిన్‌లో ఆత్మహత్యకు పాల్పడగా ఈ విషయంలో ఏ విధంగా కేసు నమోదు చేయాలనే దానిపై సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story