అమ్మాయిలు షాక్..మంచం కింద యువకుడు

by  |
అమ్మాయిలు షాక్..మంచం కింద యువకుడు
X

కృష్ణా జిల్లా నూజీవీడు ట్రిపుల్‌ ఐటీలోని అమ్మాయిల హాస్టల్‌‌లో ఓ యువకుడు దూరాడు.ఈ ఘటన శనివారం కాలేజీలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..బాలికల వసతి గ‌‌ృహంలో ఎవరూ లేని సమయంలో ఓ యువకుడు గుట్టుచప్పుడు కాకుండా దూరినట్టు తెలుస్తోంది.హాస్టల్ సెక్యూరిటీ వైఫల్యం వల్లే అతడు అమ్మాయిల గదిలోకి ప్రవేశించి రోజంతా మంచం కిందే గడిపినట్టు తెలుస్తోంది.అయితే బెడ్ కింద నుంచి శబ్దాలు రావడంతో గమనించిన యువతులు వెంటనే హాస్టల్ సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు.గదిలోకి వెళ్లి తనిఖీలు నిర్వహించిన కాలేజీ సిబ్బందికి మంచం కింద యువకుడు కనిపించాడు. కాగా,అతన్నిపట్టుకుని పోలీసులకు సమాచారమివ్వగా ఘటనా స్థలికి చేరుకున్నవారు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ యువకుడు బాలికల వసతి గృహంలోకి ఎందుకు ప్రవేశించాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.అయితే ఈ ఘటనలో యువకుడికి సహకరించిన ఆరుగురు విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.

ఫ్రాన్స్‌ని గడగడలాడిస్తున్న నల్లి

Next Story