అనాధాశ్రమంలో యువకుడిపై పైశాచికత్వం..

by  |
అనాధాశ్రమంలో యువకుడిపై పైశాచికత్వం..
X

దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనాధాశ్రమంలో ర్యాగింగ్ పేరిట సహచరులు ఓ యువకుడి బట్టలు విప్పించారు. అనంతరం దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విషయం బయటకు తెలియడంతో సహచరుల్లో ముఖ్యుడు వాసు పరారయ్యాడు. ఈ ఘటన గన్నవరం బుద్ధవరం కేర్ అండ్ షేర్ అనాధాశ్రమంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటనపై చర్యలకు ఆదేశించినట్లు అనాధాశ్రమం నిర్వాహకులు వెల్లడించారు.


Next Story