సరదాకు పోతే ప్రాణమే పోయింది

by  |
సరదాకు పోతే ప్రాణమే పోయింది
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సరదగా ఈత కొట్టేందుకు బావి వద్దకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. ఈ ఘటన జగ్గయ్య పేట మండలం తొర్రగుంటలో బుధవారం వెలుగులోకివచ్చింది.

వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన ఉపేంద్ర అనే బాలుడు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు బావి వద్దకు వెళ్లాడు. బావిలోకి దిగిన క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story

Most Viewed