ఈతకోసం వెళ్లి.. అనంతలోకాలకు!

by  |
ఈతకోసం వెళ్లి.. అనంతలోకాలకు!
X

దిశ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని కరీమాబాద్ ఉర్సు చెరువులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఉర్సు దర్గాకు చెందిన సమీర్ (17) అనే బాలుడు స్నేహితులతో కలిసి ఉర్సు చెరువులోకి ఈతకు వెళ్లాడు.

ఆ సమయంలో చెరువులో ఎక్కువగా నీరు ఉండటంతో పాటు ఆ బాలుడికి ఈత రాని కారణంగా అతను నీట మునిగి చనిపోయినట్లు తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed